Prime Minister Modi : స్వదేశీ వస్తువులే కొనుగోలు చేద్దాం

GST సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో స్వావలంబన భారత్ (విక్సిత్ భారత్) లక్ష్యం సాధించడానికి స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి, విక్రయించాలని ప్రజలకు, వ్యాపారులకు ప్రత్యేక పిలుపునిచ్చారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, స్థానిక పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, కళాకారుల ప్రోత్సాహానికి దోహదపడుతుందని ఆయన ఒక్కొక్క అంశాన్ని స్పష్టం చేశారు.ముఖ్యాంశాలు:
స్వదేశీ ప్రాధాన్యత: “స్వదేశీ ఉత్పత్తులే కొనాలి మరియు విక్రయించాలి” అని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి దుకాణం వద్ద “మేము స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే అమ్ముతాం” అనే బోర్డును ప్రదర్శించాలని సూచించారు. విదేశీ కంపెనీలు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాలని అన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ పొదుపు ఉత్సవం’ మొదలవుతోంది. ఈ సంస్కరణలు ఆరోగ్యం, బీమా, ఇతర కీలక రంగాల్లో ధరలు తగ్గించి, పండుగల సీజన్లో ప్రజలకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని మోదీ తెలిపారు.
రాష్ట్రాలు పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి. మన చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలని, నాణ్యతను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ ఆర్థిక అస్థిరతలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలంటే స్వదేశీ మంత్రం తప్పనిసరి. సౌరశక్తి, రక్షణ, డ్రోన్లు, స్టార్టప్లు, సెమికండక్టర్లు, 6జీ నెట్వర్క్లలో భారత్ పురోగతి సాధిస్తోందని ఆయన ప్రస్తావించారు.
ఈ లేఖ పండుగల సమయంలో విడుదల కావడంతో, నవరాత్రి, దీపావలి వంటి పండుగల సందర్భంగా స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలని మరింత బలపరిచింది. “నేను స్వదేశీని కొంటున్నానని గర్వంగా చెప్పండి” అని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నం ద్వారా భారత్ 2047 నాటికి అభివృద్ధి సాధించిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన నమ్ముతున్నారు.
Comments
Post Your Comment
Public Comments: