పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాలతో రైతుల సంబరాలు....
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలోని కోటపాడు, పంగిడి గ్రామంలో జడ్పిటిసి ప్రియాంక, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మంత్రి గారి PA CH.రవికిరణ్ ఆధ్వర్యంలో నాయకులు రైతులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.
కోటపాడు గ్రామంలో ఖమ్మం AMC వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎండ్లబండి పై భారీ చిత్రపటాని పెట్టి రైతులు, ప్రజలతో కలిసి గ్రామంలో మొత్తం ర్యాలీ నిర్వహించారు. అనతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు..
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ AD శ్రీనివాస్ నాయక్ గారు, PACS చైర్మన్ మందడపు సుధాకర్, సర్పంచ్ మనోహర్ రెడ్డి, మండల అధ్యక్షుడు వీరునాయక్, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, నాయకులు మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్ రావు, గుత్తా రవి, అరిఫ్, పగిళ్ళ ఉపేందుర, రైతులు, భాస్కర్, వీరు, చీనా నాయకులు తదితరులు ఉన్నారు.
Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: