చైనాలో కొత్త కరోనా కేసులు....వచ్చే వారితో ఆందోళన...
చైనాలో కరోనా వైరస్ జన్మించిన సంగతి అందరికి తెలిసిన విషయమే.ఐతే చైనా అనుసరించిన కట్టు దిట్టమైన చర్యలతో ఎట్టకేలకు వైరస్ని అదుపులోకి తేగలిగింది.ఇదే సమయంలో వివిధ దేశాల నుంచి చైనాకు వచ్చిన 54 మందికి వైరస్ సోకినట్టు వెలుగులోకి రావడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశంలో వైరస్ వ్యాప్తి తగ్గినా విదేశాల నుంచి వచ్చే వారితో తిరిగి కేసులు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి అధికారులు.గురువారం నాటికి కొత్త కేసుల సంఖ్య 55కు చేరిందని, దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 81,340 కాగా, ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 3,299కి చేరిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. విదేశాల్లో ఉన్న చైనీయులు తిరిగి స్వదేశానికి వస్తున్నారని అందువల్లే కొత్త కేసులు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.. తాజాగా నమోదైన కేసుల్లో షాంఘైలో 17, గ్వాంగ్ డాగ్ లో 12, బీజింగ్ లో 4, తియాన్ జింగ్ లో 4 కొత్త కేసులు నమోదయ్యాయని ఇవన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికి సోకిన కేసులేనని అధికారులు తెలిపారు.ఇక చైనా ప్రభుత్వం వారంలో ఒక దేశానికి ఒకే విమానం వెళ్లాలని కొత్త నిబంధన జారీ చేసింది. ఈ మేరకు విదేశీ ఎయిర్ లైన్స్ కంపెనీలకూ ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం విదేశాలకు తిరుగుతున్న విమానాల్లో 90 శాతం రద్దు చేశామని, ప్రయాణికుల సంఖ్యను రోజుకు 25 వేల నుంచి 5 వేలకు పరిమితం చేశామని అధికారులు తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: